మేడ్చల్ జోన్ బృందం, జూన్ 20: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. భారీగా నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుస్తుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ‘విద్యా దినోత్సవం’ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మంత్రి మల్లారెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, పీర్జాదిగూడ కార్పొరేషన్, ఘట్కేసర్ మండలం చౌదరిగూడ, కాచవానిసింగారంలో జరిగిన విద్యా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారని, సీఎం కేసీఆర్ విద్య ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకున్నారని కొనియాడారు.
పేద విద్యార్థులకు ఆంగ్ల మాద్యమ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారాయని, కార్పొరేట్ పాఠశాలలకు పరిమితమైన డిజిటల్ విద్య ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువైందని తెలిపారు. గుండ్లపోచంపల్లి లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలను, జడ్పీహెచ్ఎస్లో డిజిటల్ క్లాస్రూంను చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి పారంభించారు. విద్యార్థులతో కలిసి రాగి జావను సేవించారు. డీఈవో విజయకుమారి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఘట్కేసర్ మండలం మండల పరిధి కాచవానిసింగారం, చౌదరిగూడ పంచాయతీ పరిధిలలో జరిగిన విద్యా దినోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జడ్పీ, జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంత్రి మల్లారెడ్డి జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. కాచవానిసింగారంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సీబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ భరత్రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చౌదరిగూడ సర్పంచ్ రమాదేవి, కాచావానిసింగారం సర్పంచ్ వెంకట్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో జడ్పీ చైర్మన్ శరత్ చం ద్రారెడ్డి, కొర్రెముల జడ్పీ పాఠశాల లో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్లు డిజిటల్ క్లాస్లను ప్రారంభించారు. కాగా మేడ్చ ల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహరెడ్డి పుస్తకాలను పంపిణీ చేశారు. వైస్చైర్మన్ రమేశ్, దాత నారెడ్డి సునందారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. డబిల్పూర్లో డిజిటల్ క్లాస్ రూం, లైబ్రరీని ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్రెడ్డి, సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి ప్రారంభించారు. గౌడవెల్లి డిజిటల్ క్లాస్ రూంను మాజీ ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, సర్పంచ్ సురేందర్ ప్రారంభించారు. శామీర్పేట మండలం ఆలియాబాద్ గ్రంథాలయంను ఎస్ఎంసీ చైర్మ న్ ఎల్లం, ఎంఈవో వసంతకుమారి, హెచ్ఎం నర్సింగ్రావు ప్రారంభించారు. తూం కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్రూంను కౌన్సిలర్ రాజు యాదవ్ హెచ్ఎం వెంకటేశ్ ప్రారంభించారు.
జవహర్నగర్ కార్పొరేషన్లో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ బాలాజీనగర్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశా రు. బోడుప్పల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మూడు డిజిటల్ బోర్డును టీవీలను మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్నిప్ ఎఫ్ఎంసీ మేనేజర్ సుజాత, హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ డిజిటల్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. వైస్ చైర్మన్లు మల్లేష్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఘట్కేసర్లో బాలుర పాఠశాలలో చైర్పర్సన్ పావని, పోచారం పాఠశాలలో చైర్మన్ కొండల్ రెడ్డి డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. కీసరలోని 10 పంచాయతీల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సర్పంచులు మాధురి, గోపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, పెంటయ్య, రాజు, సత్తమ్మ, ధర్మేందర్, ఆండాలు, కవితజైహింద్రెడ్డి, విమల, ఎంపీటీసీలు పాల్గొన్నారు.