జవహర్నగర్, జూన్ 11: పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10ఏండ్ల పాలనలో 100ఏండ్ల అభివృద్ధి కనిపిస్తుందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని 15, 26, 27, 25, 23, 24, 22, 28, 3, 19, 18, 16 డివిజన్లలో రూ. 9కోట్లతో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్లతో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశమంతా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, సీఎం కేసీఆర్తోనే దేశం బాగుపడుతుందని అన్నారు.
జవహర్నగర్కు ఇప్పటికే సుమారు రూ. 120కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశామని, మంత్రి కేటీఆర్ మరో రూ.30కోట్లు మంజూరు చేస్తామని చెప్పాడని తెలిపారు. సమస్యలు లేని జవహర్నగర్గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పేదలు నివసించే జవహర్నగర్పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అనంతరం జవహర్నగర్ 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేశ్తో కలిసిబస్తీ దవాఖానకు మత్రి శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ మురుగేశ్ మంత్రి మల్లారెడ్డికి డోలు వాయిద్యాలు, డీజేలతో ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. బస్తీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి మల్లారెడ్డికి కార్పొరేటర్, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ఉద్యమకారులు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
ఘట్కేసర్ రూరల్, జూన్ 11: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కాచవానిసింగారంలో ఆదివారం జరిగిన మల్లారెడ్డి క్రికెట్ క్రీడల ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మండలంలోని 11 పంచాయతీలకు చెందిన మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. చౌదరిగూడ జట్టు విజేతగా నిలువగా కాచవానిసింగారం జట్టు రెండో స్థానం దక్కించుకుంది. కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ యూనివర్శిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ వెంకట్ రెడ్డి, వెంకటాపూర్ సర్పంచ్ గీత, చౌదిరిగూడ సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్, మాదారం సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఘట్కేసర్ కౌన్సిలర్ అం జిగౌడ్, మాజీ ఎంపీటీసీ రవి, జిల్లా రైతుబంధు సభ్యులు మంకయ్య, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.