జవహర్నగర్, అక్టోబర్ 9: ఆసియా ఖండంలోనే మురికి ప్రాంతంగా పేరుగాంచిన జవహర్నగర్లో పేదలు అత్యధికంగా నివసిస్తుంటారు.. జవహర్నగర్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్లో ప్రధాన రహదారిగుంతల మయమై 30 ఏండ్ల నుంచి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లాలన్నా దారిలేక ఇబ్బందిపడేవారు.. వర్షాకాలం వచ్చిందంటే అడుగుతీసి… అడుగు వేయలేని దుస్థితి..
మంత్రి చామకూర మల్లారెడ్డి తన పాదయాత్రలో కాలనీల్లో కలియ తిరుతుగుతూ.. పేదలు పడుతున్న బాధలను చూసి చలించిపోయారు.. వెంటనే శాంతినగర్ నుంచి అంబేద్కర్నగర్ ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు వేయాలని రాంకీ యాజమన్యానికి సూచించారు. పనులు మొదలు పెట్టిన అధికారులు.. మూడు నెలల్లోనే సీసీ రోడ్డు వేసి పేదల బాధలు శాశ్వతంగా తీర్చారు.. దాంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మంత్రికి, రాంకీ యాజమాన్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గుంతల రోడ్డు… సీసీ రోడ్డుగా మారడంతో కాలనీలు వెలిగిపోతున్నాయి. గతంలో రోడ్డుపై వెళ్లాలంటేనే భయ పడిన జనం.. గుంతల్లో వాహనాలు నడిపి అవస్థలు పడే వారు. వర్షం వస్తే రోడ్డు బ్లాక్ కావాల్సిందే… రాత్రిళ్లు ప్రధాన రహదారికి వెళ్లాలంటే నరకయాతన అనుభవించేవారు. ఇకపై ఆ బాధలన్నీ శాశ్వతంగా పోయి రయ్.. రయ్మంటూ వాహనాలు ప్రధాన రహదారికి 2 నిమిషాల్లోనే 2 కిలోమీటర్లు చేరుకుంటూ ఆనందపడుతున్నారు.
ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు.. పోయారు.. పేదల కష్టాలు తెలిసిన మంత్రి చామకూర మల్లారెడ్డి పాదయాత్రతో జవహర్నగర్లోని పేదల బస్తీల్లో బాధలు తెలుసుకున్నాడు… మూడు నెలల్లోనే రోడ్డును వేస్తానని మాట ఇచ్చిండు… రాంకీ యాజమాన్యంతో మాట్లాడి రూ. 2.20 కోట్లతో సీసీ రోడ్డు వేయించి… గరీబోళ్ల బాధలు శాశ్వతంగా తీర్చి గొప్ప మనసును చాటుకున్నాడు… మంత్రి మల్లారెడ్డి. 30ఏండ్ల బాధలను 3 నెలల్లోనే తీర్చినందుకు స్థానికులు జేజేలు పలుకుతున్నారు.
సీసీ రోడ్డు ఏర్పాటుతో దశాబ్దాల కల సాకరమైంది. భారీ గుంతలతో రోడ్డుపై వెళ్లలేని సందర్భాలు చూశా. ఈస్ట్ నందమూరినగర్కు పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లేవారు. మంత్రి మల్లారెడ్డి మా కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చి వెంటనే నిర్మించారు. మంత్రి మల్లారెడ్డి సార్కు కృతజ్ఞతలు.
నేను చిన్నప్పటి నుంచి ఈ రోడ్డును చూస్తున్నాను… యాదవసంఘం వద్ద రోడ్డుపై ఏర్ప డిన భారీ గుంతల్లో వాహనాలు వెళ్లలేక, మనషులు నడవలేక అవస్థలు పడేవారు. ప్రధాన రహదారికి పోవాలంటే నరకం చూసేవాళ్లం. స్కూళ్లు, ఉద్యోగాలకు పోయేవారి బా ధలు వర్ణానాతీతం. మంత్రి మల్లారెడ్డి పాదయాత్రతో చలించిపోయి.. వెంటనే సీసీ రోడ్డు వేయించటంతో మా బాధలు తీరాయి.. మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
అభివృద్ధికి చిరునామాగా జవహర్నగర్ కార్పొరేషన్.. కార్పొరేట్ హంగులతో కొత్తఅందం సంతరించుకుంది. మంత్రి మల్లారెడ్డి ప్రజల అవస్థలను కళ్లారా చూశారు. అంబేద్కర్నగర్ నుంచి శాంతినగర్ వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఏండ్లనాటి నుంచి ఇబ్బందులు పడుతున్న సమస్యలను మంత్రి మల్లారెడ్డి శాశ్వతంగా పరిష్కారం చూపారు. మంత్రి మల్లారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. అభివృద్ధి పనులకు సహకరించిన రాంకీ యాజమాన్యం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.