Shamshabad Airport | శంషాబాద్ రూరల్, జూలై 26: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిల్లెట్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఈ రెస్టారెంట్ను ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్, ఐఐఎం డైరెక్టర్ తారా సత్యవతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ మిల్లెట్ రెస్టారెంట్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వారికి అవసరమైన ఆహారం అందించడానికి విమానాశ్రయంలో ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు తెలిపారు.