ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల సమయాలను ఇటీవల కుదించిన విషయం తెలిసిందే. తాజాగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వడంతో ఈ కారిడార్లో గురువారం నుంచి యథావిధిగా సాధారణ సమయాల్లోనే (ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు) రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
-సిటీబ్యూరో