హైదరాబాద్: మెట్రో రైల్వే ట్రాక్పై (Metro train) యువకుడు హల్చల్ చేశారు. గుర్తుతెలియని యువకుడు సికింద్రాబాద్ వెస్ట్-జేబీఎస్ మార్గంలో రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గంటపాటు ఒకే ట్రాక్పై సర్వీసులను నడిపారు. కష్టం మీద అతడిని పట్టుకున్న మెట్రో సిబ్బంది.. ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. అనంతరం అధికారులు యధావిధిగా మెట్రో రైళ్లను పునరుద్ధరించారు.