సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో ఆకాశం మేఘావృతమై కొన్నిచోట్ల చిరు జల్లులు పడటంతో నగరవాసులు ఎండల తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న దిగువస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి.
నైరుతీ రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి పాక్షికంగా ప్రవేశించడంతో ఆయా ప్రాంతాల్లో మేఘావృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని, మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రలు 28.9 డిగ్రీలు, గాలిలో తేమ 44 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.