మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బుధవారం వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ఆపరేషన్లను నిలిపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఉన్న నీటి సమస్య గురించి స్థానిక ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆస్పత్రిలో నీటి ఎద్దడికి తోడు రెండు రోజులుగా ట్యాంకర్లు రాకపోవడంతో సమస్య మరింత జఠిలం అయ్యింది. జలమండలిలో మోటార్ల సమ స్య రావడంతో నీటి సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటి సమ స్య పరిష్కరించాలని వైద్యశాల సిబ్బంది, పేషెంట్లు కోరుతున్నారు.