మేడ్చల్/ రంగారెడ్డి / సిటీబ్యూరో, మే9(నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 50,821 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా… 38,446 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 27,365 మంది పరీక్షలు రాయగా 19,704 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 23,456 మంది పరీక్షలు రాయగా 18,742 ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో బాలురు, బాలికలు కలిపి 929 మంది పరీక్షలు రాయగా.. 642 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 62,553 మంది పరీక్షలు రాయగా వారిలో మొత్తం 47,474 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో బాలురు, బాలికలు కలిపి 1465 మంది పరీక్షలు రాయగా… 713 మంది ఉత్తీర్ణులయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో బాలికలు ప్రతిభ కనబర్చారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2వ స్థానంలో నిలిచిన జిల్లా.. సెకండియర్లో 5వ స్థానం దక్కించుకుంది. ప్రథమ సంవత్సరంలో 36,149 మంది బాలురు పరీక్షలు రాయగా..25,333 మంది 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 32,140 మంది పరీక్షలు రాయగా.. 25,100 మంది 78 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 53,050 మంది విద్యార్థులు రాయగా…38,958 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఇంటర్ సెకండియర్లో ఈ సారి 60.26 శాతం నమోదైంది. ఈ ఫలితాల్లో బాలురు కంటే బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలురు 51.53 శాతం, బాలికలు 68.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 35,641 మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 18,368 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 36,702 మంది పరీక్షలకు హాజరు కాగా… 25,226 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. ఒకేషనల్ సెకండియర్ ఫలితాల్లో 67.40 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 55.17 శాతం, బాలికలు 78.024 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.
ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ సారి 59.35 శాతం నమోదైంది. ఫస్టియర్ ఒకేషనల్ ఫలితాలు పెరిగాయి. ఈ సారి 54.82 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఫస్టియర్ ఒకేషనల్ కోర్సులోనూ బాలురు కంటే బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. 41.09 శాతంలో బాలురు, 68.59 శాతంలో బాలికలు ఉత్తీర్ణత సాధించారు.
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూపునకు చెందిన గొండి శ్రీహిత సెకండియర్ ఫలితాల్లో 979 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచిందని అధికారులు మంగళవారం తెలిపారు. బైపీసీ గ్రూపులో బెవర అనూష 981 మార్కులతో టాపర్గా నిలిచింది.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధిక మార్కులు సాధించిన వారి వివరాలు..