మేడ్చల్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందున్నదని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ద్వారా 2లక్షల 18 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా 30 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తకాగా.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధురాలు జానాబాయిని ఘనంగా సన్మానించారు.
ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కలెక్టర్ హరీశ్ ప్రసంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ ఆగ్యస్త, జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీసీపీ సందీప్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో…
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహానగరంలో రవాణావ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా 42 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 31 పనులు పూర్తయ్యాయని, మిగతా 11 పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు. హరితహారం పథకంలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరం వరల్డ్ గ్రీనరీ అవార్డు పొందిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, ప్రియాంక అలా, యాదగిరి రావు, కృష్ణ, కెన్నెడీ, ఈఎన్సీ జియావుద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ కుమార్, ఎస్ఈలు దత్తు పంతు, విద్యాసాగర్, జాయింట్ కమిషనర్లు శశిరేఖ, సంధ్య, సెక్రటరీ లక్ష్మి, మేయర్ ఓఎస్డీ విజయ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.