సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : భక్తుల కొంగు బంగారంగా వరాలను అందించే సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని ఇంటి వద్దే పొందేందుకు వీలుగా పోస్టల్ శాఖ నూతన సేవలను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రాగా, నిర్ణీత రుసుం చెల్లించి కిలో బంగారాన్ని(బెల్లం) ప్రసాదంగా పొందవచ్చు.
కేజీ బంగారం ధర రూ. 60 చొప్పున విక్రయిస్తుండగా, జాతర ముగిసిన వెంటనే స్పీడ్ పోస్టు ద్వారా ప్రసాదాన్ని ఇంటి వద్దే పొందేందుకు డెలివరీ సేవలను ఏర్పాటు చేసినట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎన్. రంగారావు ఓ ప్రకటనలో తెలిపారు.