అంబర్పేట, జనవరి 22 : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెం కటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ నర్సింహబస్తీలో రూ. 26.50 లక్షల వ్య యంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సింహబస్తీలో కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్య ఉందని, ఈ విషయాన్ని స్థానిక బస్తీ నాయకులు తన దృష్టికి తీసుకురావడంతో నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. అలాగే రూ.17.50లక్షలతో మంచినీటి పైపులైన్ పనులు కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. నర్సింహబస్తీని గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు బస్తీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు, పార్కుల వంటి అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ డీజీఎం డీఈ విష్ణుప్రసాద్, ఏఈ రోహిత్, ఎస్సైలు రమాదేవి, అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, నాయకులు భూపతినాథ్, శ్రీనివాస్, లక్ష్మణ్, బుచ్చయ్య, ఓంప్రకాశ్, విజయేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.