బంజారాహిల్స్,జూన్ 28 : దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత.. టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
మంగళవారం బంజారాహిల్స్ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మేయర్ విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వం, రెండోవైపున పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తోందన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.