హైదరాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేద వారి నుంచి రూపాయి కూడా చెల్లించ అవసరం లేకుండా ఉచితంగా అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. రాజేంద్ర నగర్, నార్సింగిలో 3వ విడతలో ఎంపికైన లబ్దిదారులకు 356 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మేయర్విజయలక్ష్మి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారన్నారు.
లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి విడల వారీగా ఫపేదవారికి ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కార్యధక్షత వల్లే సాధ్యమైందని చెప్పారు.
రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకతీతంగా డ్రా నిర్వహించి లబ్ధిదారులకు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ నెల 5వ తేదీన నాలుగో విడత డబుల్ ఇండ్లనుపంపిణి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నార్సింగి మున్సిపల్ చైర్మన్ రేఖ, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఆర్డీవో మల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.