బడంగ్పేట, మే 23: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ మేనమామలాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆర్థికంగా ఆదుకుంటున్నారని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిఫ్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో 48 చెక్కులను, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి ఆధ్వర్యంలో 53 కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీర్పేట మేయర్, డిఫ్యూటీ మేయర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో రాష్ట్రంలోనే బాలాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధికంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. మంత్రికి ఎల్లప్పుడు రుణపడి ఉండాలన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తించుకుని రాబోయే ఎన్నికల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మళ్లీ గెలిపించుకుందామని అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాలాపూర్ మండల తహసీల్దార్ జనార్దన్, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, రెవెన్యూ సిబ్బంది, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, కీసర గోవర్ధన్రెడ్డి, కార్పొరేటర్లు, కో – ఆప్షన్ మెం బర్లు, తదితరులు పాల్గొన్నారు.