మణికొండ, డిసెంబర్ 15 : తెలంగాణ ప్రభుత్వం మాతా శిశుసంరక్షణలో అమలు చేస్తున్న విధానాలకు ప్రశంసలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది.
ఢిల్లీలో జరిగిన నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్స్షాప్లో కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతి పవార్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వైద్య బృందం గురువారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కోకాపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మెటర్నల్ హెల్త్ వైద్యలు పద్మజ, ఇతర అధికారుల బృందం పాల్గొన్నారు.