హైదరాబాద్: నగర శివార్లలోని సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై ధ్వంసమైంది. దీంతో మేడ్చల్ వైపు వెళ్లే వాహనాలు సుచిత్ర వద్దే ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మరోదారిలో మళ్లిస్తున్నారు.
కాగా, రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి చెరువు నిండిపోయింది. చెరువు అలుగుపోస్తుండటంలో రోడ్డుపైనుంచి నీరు ప్రవహిస్తున్నది. శామీర్పేట మండలంలోని తూంకుంటలో భారీవర్షానికి ఓ ప్రైవేటు పాఠశాల నీటమునిగింది. తరగతి గదుల్లో వర్షపు నీరు ప్రవేశించింది. హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎడతెరపిలేకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.