వెంగళరావునగర్, జూన్ 24 : మధురానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతాళాలతో ఇంటి డోర్లు తెరిచి.. లాకర్లను ధ్వంసం చేసి అరకిలోకు పైగా బంగా రు నగలు, వజ్రాభరణాలు, అరలక్ష నగదును దోచుకెళ్లారు. ఆ ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్ కాలనీలోని సత్యదేవి విల్లాస్ విల్లా నం.1లో రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ ఆకుల హరిరావు నివాసం ఉంటున్నారు.
ఈనెల 21న హరిరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన ఏపీ పచ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు వెళ్లా రు. రెండ్రోజుల తర్వాత 23 అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చారు. అయితే మెయిన్ డోర్ తెరిచి ఉన్నది. లోనికి వెళ్లి చూడగా లాకర్ ధ్వంసమై ఉంది. మొదటి అంతస్తులోని బెడ్రూమ్ కూడా ధ్వంసమైంది. లాకర్లో దాచిన 600 గ్రాముల ఉంగరాలు, బ్రాస్ లెట్లు, నెక్లెస్, బంగారు గాజులు, వ జ్రాల చైన్, డైమండ్ డాలర్ ప్లాటినం గొ లుసు, ఇతర ఆభరణాలతోపాటు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం 60 లక్షలకు పైగా సొత్తు దొంగలపాలైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్పెంటర్ కార్మికులపై అనుమానం..!
ఇటీవల ఇంట్లో కార్పెంటర్ వర్కర్లచే పనులు చేయించారు. ఇంటి గురించి అవగాహన, సొమ్ము ఎక్కడ దాచిపెడ్తారో తెల్సినవారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.కార్పెంటర్ వర్కర్లు చోరీకి పా ల్పడ్డారా..? లేక ప్రొఫెషనల్ దొంగల పనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మధురానగర్ సీఐ ప్రభాకర్ తెలిపారు.