హైదరాబాద్ : హయత్నగర్లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీపుట్వేర్లో భారీగా మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
అగ్నిమాపక సిబ్బంది వెంటను స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంలో దుకాణం యజమానికి రూ.3లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.జరిగినట్లు అంచనా. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.