హైదరాబాద్ : వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమను దక్కించుకోవడానికి పెద్దలను సైతం ఎదురించి ఎనిమిది నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ వివాహిత ఉరేసుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతికుమారి (26), వెంకటసుబ్బయ్య ప్రేమించి పెళ్లి చేసుకొని మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీనివాసన్నగర్లో ఉంటున్నారు.
కాగా, శాంతి కుమారి ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.