నేరేడ్మెట్, నవంబర్ 13: మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నేరేడ్మెట్ డివిజన్లోని పార్చునర్ ఎన్క్లేవ్, యాప్రాల్, తదితర కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ మీనతో కలిసి పలు కాలనీల్లో జరిగిన సమావేశాల్లో ఆయన పా ల్గొన్నారు. ఈసందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ..గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నదని, దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మెచ్చి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్కు మద్దతిస్తున్నారని అన్నారు.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు మేము సైతం అంటున్నారన్నారు. ప్రచారంలో ఆడ పడుచులు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలకడం సంతో షంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమాన్ని బీఆర్ఎస్ పార్టీ కోరుతుందన్నారు. అందరిని అన్ని విధాలుగా అభివృద్ధి మార్గంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్లో తెలంగాణ రాష్ట్రం అ భివృద్ధిలో దూసుకోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీకే హన్మంతరావు, ఉపేందర్రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లక్ష్మిపూజలు వైభంగా జరిగాయి. అందులో భాగంగా కార్పొరేటర్ మే కల సునీతారాము యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాముయాదవ్ పాల్గొన్నారు.