నేరేడ్మెట్, నవంబర్ 5 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు బంగారు భవిష్యత్ ఉందని నమ్ము తూ, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గౌతంనగర్ డివిజన్, జ్యోతినగర్లో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. అమీర్పేట్ మాజీ కార్పొటర్ వెంకటరమణ (రాఘవన్), తన అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సుపరిపాలన సాధ్యమని కాంగ్రెస్, బీజీపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ, మ్యానిఫెస్టో కరపత్రాలను అందిస్తూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు పదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారని తెలిపారు. సీఎం పాలనలో సాగు, తాగునీరు , క రెంటు, వివిధ సంక్షేమ ప థకాలను ప్రజలకు అందించారన్నారు.
ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లినప్పుడు అభివృద్ధి, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. అలాగే..నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించి.. కారు గుర్తుకు ఓటువేసి అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ నం దికంటి శ్రీధర్, జితేందర్ రెడ్డి, రాముయాదవ్, వీరేశం యాదవ్, మురళీధర్, టీఎన్ కృష్ణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గౌలీకర్ రవీందర్, జస్బీర్ సింగ్, వేణునాయుడు , తదితరులు పాల్గొన్నారు.