మల్కాజిగిరి, నవంబర్ 2: మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. గురువారం మల్కాజిగిరి , అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం డివిజన్లలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రచేసి ఇంటింటికి ప్రచారం నిర్వహించి.. సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారని, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నార ని అన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అన్నారు.
మల్కాజిగిరిని రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారు. వాజ్పేయినగర్లోని రైల్వే గేటు వద్ద ఆర్యూబీ నిర్మించడానికి గత నాలుగు సంవత్సరాల కిందట శంకుస్థాపన జరిగిందని.. ఇప్పుడు న్న ఎమ్మెల్కే పట్టించుకోకపోవడంతో రోజు వాహనదారులు నరకాన్ని చివిచూస్తున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత వాజ్పేయినగర్, గౌతంనగర్, కాకతీయనగర్, బొల్లారంలలోని రైల్వే గేట్ల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నామని అన్నారు.
ఇప్పటికే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. విడతలవారీగా పెన్షన్లు పెంచుతామని అన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంలో మహిళలకు నెలనెలా రూ.3వేలు అందజేస్తామని అన్నారు. కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ పథకంలో ఎన్నికల తర్వాత రూ.2,00,116 పెంచుతామని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, కార్పొరేటర్లు సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, సబితాకిశోర్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, రాముయాదవ్, ఉపేందర్ రెడ్డి, గౌలికర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.