కంటోన్మెంట్, మార్చి 14: రహదారి భద్రత నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి సూచించారు. మంగళవారం బోయిన్పల్లి చౌరస్తాలో టీఆర్ఎస్కేవీ టాక్సీ సెక్టార్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రి రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కారులో ప్రయాణించే వారితో పాటు టూ వీలర్పైన ప్రయాణించే వారికి మద్యం తాగి వాహనాలు నడపరాదని, హెల్మెట్ లేకుండా బైక్ నడపరాదని ప్రయాణికులకు సూచిస్తూ వాహనదారులకు గులాబీ పువ్వులను అందించారు. అనంతరం మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత కోసం అధికారులు కృషి చేయాలని, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న, టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షులు నగేష్ కుమార్, ఉపాధ్యక్షులు ఫహీమ్ ఉద్దీన్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, ప్రభాకర్, నళిని కిరణ్, శ్యామ్ కుమార్తో పాటు పెద్దల నర్సింహ, టీఆర్ఎస్కేవీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంబు ప్రభాకర్, తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రావు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్, సీనియర్ నేతలు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, నేతలు పాల్గొన్నారు.
వాహనదారుడికి సీటు బెల్టు పెట్టుకోవాలని కోరుతూ గులాబీ పువ్వు ఇస్తూ అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
మర్రి రాజశేఖర్రెడ్డి.