సైదాబాద్, సెప్టెంబర్ 22: పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా బిల్లుకు ఆమోద ముద్ర వేయటం పట్ల తెలంగాణ జాగృతి మలక్పేట కన్వీనర్ తిరునగరి రాధ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో చేసిన పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు.
ఉభయ సభల్లో ఆమోదం పొంది రాజ్య ముద్ర పడ్డ మహిళా బిల్లును తక్షణమే ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాబోయే ఎన్నికల్లో కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయటానికి ప్రయత్నం చేస్తున్నదన్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ కవితతో కలిసి సంబురాలు జరుపుకొని, ఆమెకు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిపారు.