సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాలాలో పడి గల్లంతైన ఓ వ్యక్తి హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. ఈ సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మూసాపేట సర్కిల్లోని ప్రభాకర్ రెడ్డినగర్కు చెందిన ఆకారం రవికుమార్ (42) ఈ నెల 9న భారీ వర్షం పడిన నేపథ్యంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న నాలాలో పడి కొట్టుకుపోయాడు.
రెండు రోజులుగా గాలింపు చేపట్టగా, ఆదివారం హుస్సేన్సాగర్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. గల్లంతైన విషయంపై జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా రెండు రోజుల వరకు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.