హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్వేపై (PV Expressway) ప్రమాదం జరిగింది. ఎక్స్ప్రెస్వేపై వేగంగా దూసుకెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరాంఘర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, బైకర్కు ఫిట్స్ రావడంతో అదుపు తప్పి డివైడర్కు ఢీకొట్టిందని తెలిపారు. కాగా, ఎక్స్ప్రెస్వైపై బైక్లపై నిషేధం ఉన్నదని, అయినప్పటికీ అతడు ఎక్స్ప్రెస్వై పైకి వచ్చాడని తెలిపారు. మృతుడు ఎవరనే విషయం గుర్తించాల్సి ఉన్నదని వెల్లడించారు.