హైదరాబాద్: నగరంలోని షాపూర్నగర్లో (Shapurnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వెళ్లే దారిలో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.