హైదరాబాద్ : నగర శివారులోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మామిడిపల్లి రోడ్డు వద్ద కాలిపోయి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే ఆ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి.. ఇక్కడ తగులబెట్టి ఉండొచ్చని పహాడీషరీఫ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.