హైదరాబాద్ : తన ఇంటి ముందున్న చెట్టును నరికేసినందుకు ఓ వ్యక్తికి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రూ. 12 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును కొట్టేసిన విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు.. ట్విటర్ ద్వారా అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన అటవీ శాఖ అధికారులు ఆ ఇంటి యజమానికి జరిమానా విధించారు.