మారేడ్పల్లి, మే 20 : గోదావరి ఎక్స్ప్రెస్(Godavari Express) రైల్లో గుండె పోటుతో(Heart attack) ఓ వ్యక్తి మృతి(,Man dies) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగన్ రావు (45) సోమవారం నగరంలోని ఎల్లంపేటలో ఉంటున్న తన అల్లుడు ఇంటికి గోదావరి ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగీలో వస్తున్నాడు. అయితే జగన్రావుకు రైల్లో గుండెపోటు రావడంతో రైల్లోనే మృతి చెందాడు. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తరువాత రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమ్తితం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.