మరో ఐదుగురికి గాయాలు
సైదాబాద్, జూలై 28: వేగంగా దూసుకువచ్చిన కారు అదపుతప్పి ఫుట్పాత్పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు యువకులు గాయపడ్డారు.
సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం… రామోజీ ఫిల్మ్ సిటీ అనాజిపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఫైసల్ (35) అతడి మిత్రులు అనాజిపూర్కు చెందిన మహ్మద్ వికార్, మహ్మద్ బషారత్ అలీ, ఫలక్నామాకు చెందిన సయ్యద్ ఆరాఫత్వుద్దీన్, ముస్తఫా అలీ, మాదన్నపేటకు చెందిన సయ్యద్ నఫీవుద్దీన్ కలిసి కారులో బుధవారం రాత్రి నగరానికి వచ్చి, తిరిగి వెళ్తుండగా చంపాపేట చౌరస్తాలో కారు ఫుట్పాత్పైకి ఎక్కి వీధిలైటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. మహ్మద్ ఫైసల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించాడు.