కాచిగూడ,ఏప్రిల్ 17: పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా ఎంఎంటీఎస్ రైలు(MMTS train) ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి(Man dies) చెందాడు. కాచిగూడ రైల్వే హెడ్కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి(50) బుధవారం కాచిగూడ రైల్వేస్టేషన్ చివర్లో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై బుడిద రంగు టీ షర్ట్, నీలి రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు.మృతుని వివరాల కోసం 8712568495లో సంప్రదించాలని కోరారు.