హైదరాబాద్ : రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని(Hanging) ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఇంట్లో గొడవలతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.