మల్కాజిగిరి: మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జవహర్నగర్ కార్పొరేటర్ మురుగేశ్, డోలి రమేశ్, జీకే హన్మంతరావు, మధుసూదన్రెడ్డి, పరమేశ్, లక్ష్మణ్యాదవ్, వెంకటేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు