మల్కాజిగిరి, నవంబర్ 20: ఆటో మొబైల్, మెకానిక్స్ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం అల్వాల్ డివిజన్లోని శుభశ్రీ గార్డెన్స్ వద్ద హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆటో మొబైల్, మెకానిక్స్ యజమానులకు బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇస్తుందని అన్నారు. వాహనదారులకు ఆటో మొబైల్, మెకానిక్స్ మంచి స్నేహితులని అన్నారు. కార్మికుల కష్టాలు దగ్గరుండి చూశానని, వాటిని పరిష్కరించడానికి ముందుంటానని అన్నారు. మెకానిక్స్ యజమానులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని, ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే కుటుంబం కోసం ఆరోగ్య శ్రీ ద్వారా రూ.15లక్షలతో చికిత్సలు పొందవచ్చని అన్నారు. వృద్ధులైన మెకానిక్స్కు పెన్షన్లు కల్పిస్తామని అన్నారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూంలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు, కార్పొరేటర్ శాంతిశ్రీనివాన్ రెడ్డి, అనిల్కిశోర్, హెచ్ఎంఆర్ మెకానిక్స్ అధ్యక్షుడు అశోక్, శ్రీధర్గౌడ్, పరమేశ్, నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మాధవ్రెడ్డి, శ్రీశైలం, పాషా తదితరులు పాల్గొన్నారు.