కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం ..
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
కేంద్రం తీరుపై మల్కాజిగిరి, అల్వాల్ మండల కార్యాలయాల వద్ద గులాబీ శ్రేణుల నిరసనలు
మల్కాజిగిరి/నేరేడ్మెట్, ఏప్రిల్ 4: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం మల్కాజిగిరి, అల్వాల్ మండల కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, మీనా ఉపేందర్రెడ్డి, ప్రేమ్కుమార్, సునీతా రాముయాదవ్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడని అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం ముందుకు రాకపోవడం దారుణమన్నారు. కేంద్రం.. రైతులు పండించిన ధాన్యం కొనేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి మోదీ రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని.. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర పోనియ్యమని అన్నారు.
ఈ నెల 11 వరకు ధాన్యంపై నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఢిల్లీలో మేమేంటో చూపిస్తామన్నారు. రైతుల ప్రయోజనాలకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని అన్నారు. పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో కొన్నట్లుగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ జ్యోతిగౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌ డ్, ప్రజా గాయకుడు గద్దర్, అనిల్కిశోర్, పుదారి రాజేశ్కన్న, శ్రీనివాస్గౌడ్, సురేందర్రెడ్డి, బలవంత్రెడ్డి, ప్రభాకర్, సంతోశ్, ప్రేమ్, బబిత, పద్మావతి, అమృత, బద్దం పరశురాంరెడ్డి, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, రావుల అంజయ్య, పిట్ల శ్రీనివాస్, జీవగన్, జీఎన్వీ సతీశ్ కుమార్, రాముయాదవ్, గుండా నిరంజన్, చంద్రమౌలి, మహత్యవర్ధన్, కపిలేశ్వర్, సాయికుమార్రెడ్డి, మహేశ్, సూరి, బాలరాజు యాదవ్, సత్యమూర్తి, శ్రీనివాస్రెడ్డి, అమీనొద్దీన్, భాగ్యానంద్రావు, మోహన్రెడ్డి, సంతోశ్ రాందాస్, యాదగిరి, నారాయణరెడ్డి, యాది, పల్లె విజయకుమారి, గద్వాల జ్యోతి పాల్గొన్నారు.