నేరేడ్మెట్, నవంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్తోనే సాధ్యమని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్లోని ఇందిరా నెహ్రూనగర్, జయగిరి లక్ష్మీనర్సింహస్వామినగర్, న్యూ వెంకటేశ్వరనగర్, జ్యోతినగర్, గోపాల్నగర్, న్యూమిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్తో కలిసి ఆయన ఇంటింటికి తిరిగుతూ..బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రచారం చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే రూ.2వేల ఆసరా పింఛన్ను రూ.5వేలకు పెంచడంతోపాటు మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఆడపడుచుల బ్యాంక్ ఖాతాల్లో నెలకు రూ.3వేలు జమ అవుతాయని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నా రు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి మందికి రూ.5లక్షలకు కేసీఆర్ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు చె ప్పారు.
గ్యాస్ సిలిండర్ ధరను బీజేపీ రూ.1000లకు పెంచితే..అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400లకే అందించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వివరిం చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఇన్చార్జి జితేందర్ రెడ్డి, నర్సింహయాదవ్, నాయకులు మేకల రాముయాదవ్, సిద్ధిరాములు, పీవీ సత్యనారాయణ, గొల్లపల్లి కృష్ణగౌడ్, నగేశ్ గౌడ్, పరమేశ్, మల్లేష్యాదవ్, కాటంరా జు, నర్సింగ్, సత్యనారాయణ, వీరే షం యాదవ్, కృష్ణగౌడ్, కిట్టు, అనిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.