మల్కాజిగిరి జోన్ బృందం, ఏప్రిల్ 10: మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మల్కాజిగిరి, అల్వాల్, నేరేడ్మెట్, గౌతంనగర్, మౌలాలి , వెంకటాపురం డివిజన్, తదితర డివిజన్లలోని సీతారాముల ఆల యాలు, ఆంజనేయస్వామి ఆలయం, ఇతర ఆలయాల్లో వేడుకలను కమనీయంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి.. కల్యాణానికి పట్టువస్ర్తాలను సమర్పించారు. ఆయా ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. సీతారాముల అనుగ్రహాన్ని పొందేందుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
మల్కాజిగిరిలో శ్రీరాములవారి శోభాయాత్ర