మల్కాజిగిరి జోన్ బృందం, అక్టోబర్ 31: ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజిగిరి ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. మంగళవారం అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేపట్టి.. ప్రచారం నిర్వహించారు. అనంతరం పలు కాలనీల్లో జరిగిన సమావేశాల్లో మర్రి మమతా రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారని అన్నారు.
అర్హులైన వారిని గుర్తించడం కోసం ఇంటింటికి సర్వే చేయించిన తర్వాత వారికి సంక్షేమ ఫలాలు అందజేస్తామని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడకుండా పబ్బం గడిపి, స్వంత వ్యాపారాలతో కాలం వెల్లదీసిన ఎమ్మెల్యే మైనంపల్లిని ఇంటికి పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి సతీమణి మమతారాజశేఖర్రెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, సబితాకిశోర్, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగరావు, సర్కిల్ అధ్యక్షు డు జితేందర్రెడ్డి, జేఏసీ వెంకన్న, ఉపేందర్రెడ్డి, రాముయాదవ్, అనిల్కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, అమీనుద్దీన్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.