హైదరాబాద్ : నగరంలోని కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పురానాపూల్లోని ఓ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భవనాన్ని కూలర్లు, టైర్ల గోడౌన్గా వినియోగిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజిన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పొగ ఆ ప్రాంతాన్ని కప్పేడం, భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.