ఆర్కేపురం, ఏప్రిల్ 9 : మహేశ్వరం నియోజకవర్గాన్ని వేయ్యి కోట్ల నిధులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి అభివృద్ధి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నెంటూరి రవీందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్తో మాట్లాడి నిధుల కొరతలేకుండా చూస్తున్నారని చెప్పారు. మంత్రి నేతృత్వంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేనిశక్తిగా ఎదిగిందన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో, కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గం ఐటీ, ఎలక్ట్రిక్, హెల్త్హాబ్గా మారుతుందన్నారు. ఓఆర్ఆర్ రింగ్రోడ్డుకు లోపల ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక నిధులతో తాగునీటిని అందిస్తున్నారని చెప్పారు. రూ.370 కోట్ల నిధులతో బడంగ్పేట, మీర్పేట్, జల్పల్లి, తుక్కుగూడలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని తప్పుడు ఆరోపణలు, జిమ్మికులు చేసినా మంత్రి సబితాఇంద్రారెడ్డి మళ్లీ విజయఢంకా మోగిసారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరెల్లి వెంకట్రెడ్డి, మారోజు రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, పెంబర్తి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, రమేశ్కుర్మ తదితరులు ఉన్నారు.