మహేశ్వరం, మే 8 : బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, ఆ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు ఏపూరి రాజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయన్నారు. సంక్షేమ రంగంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుడ్డు క్రిష్ణ యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, దోమ శ్రీనివాస్రెడ్డి ఎస్.కె.ఆజాం, బాల్రాజ్, రాజేశ్, కుమార్, సంజీవ, మహేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే దేవాలయాలు అభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు మంత్రిని కలిసి.. మహేశ్వరంలో ప్రసిద్ధి గాంచిన శివగంగ దేవాలయం అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేయండంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దేవాలయాలకు దూప దీప నైవేద్యంతో పాటు ఆయా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో దేవాలయానికి రూ.కోటి చొప్పున రూ. 5 కోట్లు నిధులను విడుదల చేసిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి నాయకులు కూన యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, దోమ శ్రీనివాస్రెడ్డి, బాల్రాజ్, నవీన్, దుడ్డు కృష్ణ, ఈవో మురళీకృష్ణ, ఎస్కే ఆజాం, వీరేశం, ఈవో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, మే 5 : పురాతన దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ ఆలయ అభివృద్ధికి రూ. కోట్టి రూపాయల నిధులను మంజూరు చేసిన సందర్భంగా ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆలయ అధికారులు సోమవారం మంత్రి సబితాఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ముదిరాజ్, కార్యనిర్వాహణాధికారి సుబ్రహ్మణ్యం, రికార్డ్ అసిస్టెంట్ గోడిసే శ్రీకాంత్గౌడ్, డైరెక్టర్లు మురళీధర్రెడ్డి, రాగం సునీల్యాదవ్, ఎంకే. మహేశ్, పుష్పమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.