ఉప్పల్, అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీమార్గమే సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నదన్నారు. అహింస, శాంతి, సత్యమే ధ్వేయంగా గాంధీజీ పనిచేశారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాల సాధనకు నేటి సమాజం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా నాచారంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్శేఖర్, చిలుకానగర్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నేతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
కాప్రాలో..
కాప్రా : మహాత్మాగాంధీ జయంతి వేడుకలను కాప్రాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ కాప్రాసర్కిల్ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, పావనీ మణిపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్రెడ్డి, సీపీఎం నాయకులు యాదగిరిరావుతో పాటు వివిధపార్టీల నాయకులు వేర్వేరుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు.
స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో..
మహాత్మాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ‘మతోన్మాదం దేశానికి అరిష్టం’ అనే అంశంపై కాప్రా సర్కిల్ కార్యాలయం ఆవరణలో ‘చర్చ-నివాళి’ కార్యక్రమం నిర్వహించారు. వెంకటసుబ్బయ్య, గగన్కుమార్, పీఎస్ఎన్ మూర్తి, కోమటి రవి, యాదగిరిరావు ప్రసంగించారు. శివన్నారాయణ, శివరామకృష్ణ, కేసీఆర్ దాస్, పీబీ చారి, వెంకటేశ్వరరావు, దుర్గాచారి,జయరాజ్, లీలావతి, ప్రవీణ, దువా, శారద, ప్రసాద్బాబు పాల్గొన్నారు.
గాంధీనగర్లో….
కాప్రా డివిజన్ గాంధీనగర్లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.మహేశ్, యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, మొగులయ్య, రాంచందర్, బాలకృష్ణ, అశోక్, హరి, డీ.మహేశ్, నితిన్, సంతోష్ పాల్గొన్నారు.
మల్లాపూర్లో…
మల్లాపూర్ : మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని సోమవారం చర్లపల్లి డివిజన్ సోనియాగాంధీనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
చర్లపల్లి కారాగారంలో..
గాంధీ జయంతిని పురస్కరించుకొని చర్లపల్లి కేంద్ర కారాగారంలో సోమవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా జడ్జి ఎస్. శశిధర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఖైదీలు నివసించే పరిసరాలను సందర్శించి ఖైదీ లకు ఇచ్చే ఆహార పదార్ధాలను పరిశీలించారు. కార్యక్ర మంలో బీఆర్ మధుసూధన్, డాక్టర్ పట్టాభిరాం, కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి సంతోష్కుమార్ రాయ్, ఎం.కృష్ణమూర్తి, శశికాంత్, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, కారా గార సిబ్బంది, వైద్యాధికారులు పాల్గొన్నారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ శ్రీధర్ కళాబృందం తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఖైదీలను ఉత్తేజపరిచారు.