హైదరాబాద్: మాదాపూర్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ను ఢీకొన్న సృజనకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సమయంలో సృజన్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అని తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత కారు వదిలి సృజన్ పరారైన సంగతి తెలిసిందే.
బైక్ను సృజన్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న యువతి దుర్మరణం చెందగా, యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సృజన్ కుమార్ కారుపై 11పైగా ఈ-చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో అధికభాగం డేంజరస్, ర్యాష్ డ్రైవింగ్ కింద నమోదైనవే కావడం గమనార్హం.