హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ సనత్నగర్లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఆమె అదృశ్యమైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో.. ఇంటి యజమానికి ఫోన్ చేశాడు. సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయిందని యజమాని తండ్రి భాస్కర్ రావుకు తెలిపాడు.
అనుమానం వచ్చి ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటల సమయంలో ఇల్లు తెరిచి చూడగా, ఫోన్ రూమ్లోనే ఉంది. కానీ ఆమె లేదు. దీంతో తండ్రి భాస్కర్ రావు తన కూతురు అదృశ్యంపై సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలదు. ఆమె కనిపిస్తే సనత్నగర్ ఎస్హెచ్వో 9490617132, ఎస్ఐ 8919558998 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.