కందుకూరు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, తదితరులు ఎమ్మెల్యేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను చాలెంజ్గా తీసుకొని ఇప్పటి నుంచి కష్టపడి పని చేయాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాటలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయం కోసం పని చేసిన వారి సేవలను గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తానని, బీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో అగర్మియగూడ సర్పంచ్ ఈర్లపల్లి భూపాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.