సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): మహిళా సాధికారతకు తోడ్పాటును అందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు మేయర్ గద్వా ల విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజన్లు, వివిధ ప్రతిభావంతుల (దివ్యాంగుల)కు సహాయం అందించేందుకు కృషి చేయాల న్నారు. బంజారాహిల్స్లోని సీఎంటీఐఎస్లో సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మేయర్ రుణాల పంపిణీపై అధికారుల తో సమీక్షించారు. మహిళలకు ఆర్థిక చేయూత అందించే పలు రకాల రుణా లు అర్హులైన వారందరికీ పంపిణీలో ఆర్పీల పాత్ర కీలకమని, అందుకు వా రికి డ్రెస్కోడ్ను అమలు చేయాలని మేయర్ తెలిపారు. మహిళలు ఆర్థిక శక్తి, బ్యాంకు రుణాలే కాకుండా పలు విభాగాలలో భాగస్వామ్యాన్ని కల్పిం చాల ని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ సంవత్సరంలో గ్రేటర్లో 1713 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంలో ఇప్పటి వరకు 48,564 సభ్యులతో కూడిన 515 గ్రూపులను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. బస్సు ఢీకొని మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు సునీత ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.