– ఉప వెంకయ్య నాయడు
హిమాయత్నగర్,మార్చి26: దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. నవయుగ భారతి రూపొందించిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్వర్గీయ సోమేపల్లి సోమయ్య జీవిత గ్రంథావిష్కరణ సభ శనివారం సాయంత్రం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు,విశిష్ట అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై గ్రంథావిష్కరణ చేశారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తన వ్యక్తిగత ఎదుగుదలకు మార్గదర్శకులో సోమేపల్లి సోమయ్య ఒకరని గుర్తు చేశారు.సంస్కారం, క్రమ శిక్షణ,జాతీయ భావం అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకున్నానని చెప్పడానికి తాను గర్విస్తున్నానన్నారు. మాకు దిక్సూచిగా నిలిచిన సోమయ్య పుస్తకాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. పాశ్చత్య విదేశీ విద్యా విధానం మన కట్టుబాటుల్ని పూర్తిగా విస్మయం చేస్తుందని, భారతీయ విద్యా విధానాన్ని తేస్తే అందుల్లో పొందుపరిచిన మహనీయులను వేరొక పార్టీలకు అంటగట్టే పరిస్థితులు మన దేశంలో ఉండటం విచారకరమన్నారు. భాష అనేది భావాన్ని వ్యక్తపరుస్తుందని, ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి అపాయిమెంట్ లెటర్ ఇంగ్లీష్లో ఇస్తే ఎలా, గెజిట్ నోటిఫికేషన్లు ఇంగ్లిష్లో విడుదల చేయడం సరికాదన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణమూర్తి, వి.భాగయ్య, బాలేంద్ర పొట్లూరి,కార్యదర్శి నేతి క్షీరసాగర్ పాల్గొన్నారు.