వెంగళరావునగర్, సెప్టెంబర్ 9 : పర్యావరణహితం కోసం మట్టి గణపతుల్ని పూజిద్దామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. గురువారం సోమాజిగూడ డివిజన్..ఎల్లారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద మట్టి గణపతులను ఎమ్మెల్యే మాగంటి ప్రజలకు పంపిణీ చేశారు.
సుమారు 500 విగ్రహాలను ఎమ్మెల్యే మాగంటి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలు తొలగించే వినాయక చవితిని సకుటుంబ సమేతంగా నియమినిష్టలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మట్టి వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
మట్టి విగ్రహాలతో నగరం కలుషితం కాకుండా ఉంటుందని.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత, టీఆర్ఎస్ పార్టీ డివినజ్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్నూఖాన్, మధుయాదవ్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ శరత్ గౌడ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.